'సరిలేరు నీకెవ్వరు'మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.. అందులో భాగంగానే ఇప్పటికే 'మైండ్ బ్లాక్'సాంగ్ అనే సినిమాని విడుదల చేశారు. విడుదలైన ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మరో సాంగ్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయిపొయింది. దీనిలో భాగంగా 'సూర్యుడివో చంద్రుడివో'అంటూ సాగే మెలోడీ పాటను సోమవారం సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్కు సంబంధించి ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది.
ఈ పాటను రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ పాట చాలా సంతృప్తిని ఇచ్చిందని రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ..భారీ అంచనాల నడుమ ఈ సినిమాని సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న విడుదల కానుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.