సంక్రాంతి బరిలో మహేష్ , అల్లు అర్జున్

Update: 2019-09-07 09:03 GMT

తెలుగు సినిమాకి సంక్రాంతి పండగ అనేది పెద్ద పండగానే చెప్పాలి ఈ టైంలో ఎక్కువగా బడాబడా హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి ..ఈ నేపధ్యంలో ఈ సంక్రాంతికి రెండు బడా హీరోల సినిమాలు విడుదలకి సిద్దం అవుతున్నాయి . అందులో మహేష్ బాబు సరిలేరు నికేవ్వరు సినిమా కాగా మరొకటి అల్లు అర్జున్ అల వైకుంటపురంలో అనే సినిమాలు ఉన్నాయి . సరిలేరు నికేవ్వరు సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా , అల వైకుంటపురం సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు .

ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడం పక్కానే కానీ డేట్ ఎప్పుదన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు .12-01-2020 న అల వైకుంటపురంలో సినిమాని 14-01-2020 న సరిలేరు నికేవ్వరు సినిమాని విడుదల చేస్తారని తెలుస్తుంది . ఈ రెండు సినిమాలో ఓ ప్రత్యేకత కూడా ఉంది . టాలీవుడ్ వెండి తెర మీద తమదైన ముద్ర వేసిన నటీమణులు ఈ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారిలో ఒకరు టబు.. ఆమె . టబు అల వైకుంటపురంలో మేరవబోతున్నారు. ఇక లేడీ అమితాబ్ గా తెలుగు తెరమీద హీరోలతో అమానమైన క్రేజ్ సంపాదించుకున్న విజయశాంతి  సరిలేరు నికేవ్వరు సినిమాలో మళ్లీ మేకప్ వేసుకున్నారు. 

మొత్తమ్మీద ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడంతో అభిమానుల్లో ఇప్పటి నుంచే విపరీతమైన చర్చ నడుస్తోంది. 

Tags:    

Similar News