దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య మనీషారెడ్డి ఈరోజు పండంటి పాపకి జన్మనిచ్చింది. ఇంతకుముందు ఈ దంపతులకి ఓ కొడుకు వున్నాడు... సందీప్రెడ్డి 2014లో మనీషాను వివాహంచేసుకున్నారు. అనంతరం పుట్టిన మొదటిసంతానానికి అర్జున్రెడ్డి అనే నామకరణం చేశారు.
ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'అర్జున్రెడ్డి` సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సందీప్రెడ్డి వంగ.. చేసిన మొదటి సినిమాతోనే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ దర్శకుడు.. ఇక ఇదే చిత్రాన్ని హిందీలో `కబీర్సింగ్` పేరుతో షాహీద్ కపూర్ హీరోగా రీమేక్ చేశాడు.. అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సందీప్ నాగశౌర్యతో సినిమాని చేసేందుకు సిద్దం అవుతున్నారు.