తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

గురువారం తన స్నేహితురాలు రమ్యా సుబ్రమణియన్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి సమంత.

Update: 2019-12-19 08:09 GMT
నటి సమంత, రమ్యా సుబ్రమణియన్‌

గురువారం తన స్నేహితురాలు రమ్యా సుబ్రమణియన్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి సమంత. కాలి నడన ఏడుకొండలు ఎక్కి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రమ్యా సుబ్రమణియన్‌ తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేశారు. 

తిరుపతి దర్శనం ఎంతో అద్భుతం. 2019కి మంచి వీడ్కోలు.. అదే విధంగా 2020కి శుభారంభం. ఇందుకు వెంకటేశ్వరుడికి.. అదే విధంగా నా తిరుపతి పార్ట్‌నర్‌ సమంతకు ధన్యవాదాలు' ఆంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఇక యాంకర్ గా తన కేరియర్ ని మొదలుపెట్టిన రమ్యా సుబ్రమణియన్‌ ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యారు. ఇక పెళ్లి తర్వాత వైవిద్యమైన పాత్రలు చేస్తుంది సమంత.




Tags:    

Similar News