కాలినడకన తిరుమల చేరుకున్న సమంత

Update: 2019-04-02 05:18 GMT

ప్రముఖ సినీనటి అక్కినేని సమంత తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన ఏడుకొండలు ఎక్కింది. నాగచైతన్య-సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం యూనిట్ తిరుమల చేరుకుంది. చిత్ర బృందం మొత్తం కారులో కొండపైకి చేరుకుంటే సమంత మాత్రం సామాన్య భక్తులతో కలిసి నడిచి కొండపైకి చేరుకుంది. ఈరోజు ఉదయం శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నెల 6వ తేదీన శ్రీ వికారి నామ సంవత్సరం పురష్కరించుకుని ఆలయ శుద్ధి చేపట్టారు. ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో సాయంత్రం లోగా సమంత స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. 

Similar News