అదేరోజు బన్ని .. ముందు రోజు మహేష్

రెండు భారీ సినిమాలు కావడంతో నిర్మాతలకి నష్టం వచ్చే అవకాశం ఉంది. అందులో మళ్ళీ కలెక్షన్ల ప్రభావం

Update: 2019-11-22 11:10 GMT
mahesh and allu arjun

ఈ సంక్రాంతికి బన్ని, మహేష్ సినిమాలు ఒకేరోజు విడుదల అవుతాయిని ముందు ప్రకటించాయి చిత్ర యూనిట్.. కానీ ఇప్పుడు ఇందులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అనుకున్న టైంకి ( జనవరి 12)న అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో వస్తుండగా, మహేష్ సరిలేరు నీకెవ్వరు ఒకరోజు ముందుకు ( జనవరి 11) న వస్తున్నట్టు తెలుగు చిత్ర నిర్మాణాల సంస్థ పేర్కొంది.

రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో చిత్ర నిర్మాతలకి నష్టం వచ్చే అవకాశం ఉంది. అందులో మళ్ళీ కలెక్షన్ల ప్రభావం రెండు సినిమాలపై పడుతుంది. దీనికి తోడు ధియేటర్ల కొరత ఏర్పడుతుంది. దీనితో  చిత్ర నిర్మాతలు చర్చించి విడుదల తేదిలో మార్పులు చేసుకున్నారు.

మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక జులాయి, సన్నాప్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్ ,అల్లు అర్జున్ కాంబినేషన్ లో అల వైకుంఠపురములో అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

Tags:    

Similar News