వారిద్దరి మధ్య ఆ ఒప్పందం అలా ఉండేదట .. !

Update: 2019-09-26 09:09 GMT

హాస్యనటుడు వేణుమాధవ్ మరణం సినిమా ఇండస్ట్రీని విషాదంలో నింపింది. అయన మరణం పట్ల సినీ పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. వేణుమాధవ్ మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాధపడుతున్నారు. వేణుమాధవ్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా తొలిప్రేమలో అయన చేసిన ఆర్నాల్డ్ శేఖర్ పాత్రకి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత వేణుమాధవ్ వెనుకకి తిరిగి చూసింది లేదు. వరుస సినిమాలు చేస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగారు.

అయితే వేణుమాధవ్ సినిమా ఇండస్ట్రీలో అందరితో మంచి స్నేహాన్ని మైంటైన్ చేసారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. వేణుమాధవ్ , పవన్ కళ్యాణ్ కలిసి తొలిప్రేమ, గోకులంలో సీత, గుడుంబా శంకర్, తమ్ముడు,అన్నవరం,బంగారం సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య ఓ ఒప్పందం ఉండేదట. పవన్ కళ్యాణ్ కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అయన సినిమాలు చేస్తూనే వ్యవసాయం చేసేవారు. అలాగే వేణుమాధవ్ కూడా తనకి సినిమాల్లో వచ్చిన డబ్బులతో పొలం కొనుక్కొని వ్యవసాయం చేసారట. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన పొలంలో పండే ఓ బస్తా బియ్యాని ప్రతి ఏడాది ఇంటికి పంపాలని వేణుమాధవ్ ని కోరారట... అలాగే వేణుమాధవ్ కి పవన్ కళ్యాణ్ కూడా తన పొలంలో పండే పండ్లను పంపేవారట... ఈ విషయాన్నీ వేణుమాధవ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

Tags:    

Similar News