రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్ అవాస్తవం : రష్మిక మేనేజర్ క్లారిటీ

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. సరిగా ట్యాక్స్

Update: 2020-01-16 14:06 GMT

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. సరిగా ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రష్మిక మేనేజర్‌ స్పందించారు.. ఐటీ రైడ్స్ జరిగినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. రష్మిక ప్రతి అకౌంట్‌, లావాదేవీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన తెలిపారు.

ఇక రష్మిక తండ్రి మదన్‌ వ్యాపారాలపై ఐటీ సోదాలు జరిగాయని వెల్లడించారు. ఈ నేపధ్యంలో కర్నాటకలోని కూర్గ్‌లో ఉన్న ఆమె నివాసంపై ఐటీ రైడ్స్ జరిగినట్టుగా వార్తలు రావడంతో అందరు నిజమేనని అనుకున్నారు.

ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన రష్మిక గీతా గోవిందం సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్టాట్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలను అందిపుచ్చుకుంది. ఈ నేపధ్యంలో తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది. సినిమాలో ఆమె నటనకి గాను మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం రష్మిక నితిన్ తో భీష్మ, అల్లు అర్జున్ తో మరో సినిమాని చేస్తుంది.  

Tags:    

Similar News