నితిన్ పెళ్లికి కారణం.. ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషమట!
టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న హీరోలలో ఒకడైనా నితిన్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.
టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న హీరోలలో ఒకడైనా నితిన్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. షాలిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు నితిన్.. ఈరోజు హైదరాబాద్లోని నితిన్ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఏప్రిల్ 16 దుబాయ్ లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాదులో గ్రాండ్ గా రిసిప్షన్ ని నిర్వహించనున్నారని తెలుస్తోంది.
కొత్త జంట నితిన్, షాలిని పెద్దలు ఆశీర్వదించారు. తమ జంటను ఆశీర్వదించాలని నితిన్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలను కోరారు. నితిన్ కి పెళ్లి అవ్వుతుండడంతో అభిమానులతో పాటు సినీ తారలు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్నా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''అభినందనలు నితిన్ సార్!! చూశారా, నేనొచ్చిన వేళా విశేషం మీరు పెళ్లిచేసుకోబోతున్నారు. ఇదంతా సరదాకే. మీ ఇద్దరిని ఇలా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది'' అని ట్వీట్ చేసింది.
Congratulations @actor_nithiin saaaaaaaaar.!!😁😁💃🏻 See I am lucky for you. You are getting off married and all.😂 Just kidding. I am super happy happy for you two.!♥️ https://t.co/k8P3ZyF65p
— Rashmika Mandanna (@iamRashmika) February 15, 2020
ప్రస్తుతం నితిన్, రష్మిక కలిసి 'భీష్మ' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 17న ఘనంగా నిర్వహించనున్నారు.