వైరల్ : లోకల్ ఏరియాల్లో షాపింగ్ చేసిన రష్మీ...

Update: 2019-10-27 04:08 GMT

హిందువులకి దీపావళి అనేది పెద్ద పండగ.. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా గడుపుతారు.. తమ బంధువులతో కలసి టపాసులు కలుస్తూ ఆనందంగా గడుపుతారు.. అయితే ఇదే పండగను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు కూడా ఉంటాయి.. ఈ పండగ కోసం బాణాసంచాలు, మట్టిదివ్వెలు తయారుచేస్తూ వాటిని అమ్మనుకొని వాటిపై వచ్చే ఆదాయంతో బ్రతుకుతుంటారు...అలాంటి వాళ్ళని ఉద్దేశించి జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఓ చక్కని ట్వీట్ చేస్తూ మంచి మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె చేసిన ఆ ట్వీట్ వైరల్ గా మారింది.

మట్టిదివ్వెలు చేస్తున్న ఓ ముసలాయనతోపాటు,ఫుట్ పాత్‌పై బాణాసంచ అమ్ముతున్న ఓ మహిళ పోస్టుల్ని రష్మీ దీపావళికి ముందే ట్వీట్ చేసింది. ఈ పండుగకి షాపింగ్ మాల్స్ ని స్కిప్ చేసి లోకల్ ఏరియాల్లో షాపింగ్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. ఆమె చేసిన ఈ ట్వీట్ కి ఆమె అభిమానులు మాత్రమే కాదు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. లైక్స్ పైన లైక్స్ కొడుతూ మీరు గ్రేట్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రష్మీ లోకల్ ఏరియాలో షాపింగ్ చేస్తున్న ఫోటోలను సైతం పోస్ట్ చేసింది రష్మీ..



Tags:    

Similar News