ప్రతి రొజూ పండగే సెట్లో రాశీ ఖన్నా బర్త్డే వేడుకలు
నేటితో ముప్పై సంవత్సరాలను పూర్తి చేసుకుంది. రాశీఖన్నా పుట్టిన రోజు కావడంతో ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రతిరోజు పండగే సెట్
మోడలింగ్ నుంచి సినిమా పరిశ్రమకి వచ్చింది హీరోయిన్ రాశీ ఖన్నా.. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగాశౌర్య హీరోగా వచ్చిన ఊహాలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. ఈ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చేసిన సినిమాలు మంచి సక్సేస్ కావడంతో రాశీఖన్నాకి స్టార్ హీరోలతో ఛాన్స్ లు వచ్చాయి. ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ, రవితేజతో చేసిన బెంగాల్ టైగర్, వరుణ్ తేజ్ తో చేసిన తొలిప్రేమ సినిమాలు రాశీఖన్నాకి మంచి పేరును తీసుకురావడంతో పాటు స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలబెట్టాయి..
అయితే ఈ అందాల భామ నేటితో ముప్పై సంవత్సరాలను పూర్తి చేసుకుంది. రాశీఖన్నా పుట్టిన రోజు కావడంతో ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రతిరోజు పండగే సెట్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు చిత్ర యూనిట్.. ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా వెంకీమామ, వరల్డ్ ఫేమస్ లవ్, సైతాన్ కా బచ్చా అనే సినిమాలు చేస్తుంది. అయితే రాశీఖన్నా.. ఇందులో వెంకీమామ సినిమాని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.