డబల్ సెంచరీ కొట్టిన రాములో రాములా
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో' .. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే సినిమా విడుదలకి ముందే తమన్ అందించిన పాటలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా పాటలు యూట్యూబ్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి...
అయితే ఇందులోని రాములో రాములా పాట ఏకంగా 200 మిలియన్ల వ్యూస్తో డబుల్ సెంచరీ కొట్టేసింది. ఈ పాటను గేయ రచయిత కాశర్ల శ్యాం రాసిన పాటను తమన్ సంగీత సారధ్యంలో అనురాగ్ కులకర్ణి, సత్యవతి (మంగ్లీ)లు కలిసి ఆలపించారు. ఈ పాటను సినిమాలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ పాట కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకి సైతం బాగా నచ్చేసింది. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ పాటకి ఉన్న క్రేజ్ చూస్తుంటే మూడు మిలియన్ల మార్కును ఈజీగా దాటేస్తుందని తెలుస్తోంది.
There's no stopping for #AlaVaikunthapurramuloo! Massive 200Million+ views for #RamulooRamulaa Full Song🥁
— Aditya Music (@adityamusic) February 14, 2020
►https://t.co/0eED9FCnTa @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @adityamusic @anuragkulkarni_ @LyricsShyam #Mangli #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA pic.twitter.com/QZHSBkCOnK
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, నివేతా పెతురాజ్, సుశాంత్ , తనికెళ్ళ భరణి మొదలగువారు కీలక పాత్రల్లో మేరిశారు. ఈ సినిమాని అల్లు అరవింద్, రాధకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. 300 కోట్లను కొల్లగొట్టిన ఈ చిత్రం కొన్ని చోట్లలో నాన్ బాహుబలి రికార్డులని సైతం సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు.