ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం 'రెడ్'.. ఇది రామ్ కి 20 వ చిత్రం కావడం విశేషం.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తమిళంలో విజయం సాధించిన 'తడమ్'కి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ రోజు సినిమాకి సంబంధించిన టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఒకటి ఇరువై సెకండ్స్ ఉన్న ఈ చిత్ర టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది..
'క్రైం హిస్టరీలో ఇలాంటి కేసును చూడడం ఇదే ఫస్ట్ టైం' అనే డైలాగ్తో ఆరంభమైన చిత్ర టీజర్ ఆధ్యంతం ఆసక్తిని కలిగించింది. 'వాంటెడ్గా ఇందులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే లైఫ్లో వాడుకున్న వన్ అండ్ ఓన్లీ అబ్సెషన్.. నేనే' అని చివర్లో రామ్ చెప్పే డైలాగ్ టీజర్ కి మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో రామ్.. సిద్ధార్థ్, ఆదిత్య అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో రామ్కు సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇందులో వెన్నెల కిషోర్, సత్య, పోసాని, నాజర్ తదితరులు నటించారు.
ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడం, 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాల తర్వాత కిషోర్ తిరుమల - రామ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్ర కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు విడుదలైన టీజర్ ఆ అంచనాలను భారీగా పెంచింది. సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు.