వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ ఘటనపై అయన ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఈ విషయాన్ని అయన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని వర్మ వెల్లడించాడు.
My next film is titled "DISHA" which is going to be about the DISHA rape ..After the brutal rape and horrific murder of NIRBHAYA, the DISHA rapists went further in their ghastliness in actually burning the poor girl with petrol #DishaNirbhayaTruth pic.twitter.com/3SiiesIgR8
— Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020
"నా తదుపరి చిత్రం ' దిశ'... 'నిర్భయ' హత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు. దిశ ఘటన తర్వాత రేపిస్టులు ఎం నేర్చుకోలేదని, వారి ఆగడాలు ఎ మాత్రం ఆగలేదని అన్నాడు. ఆలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో ఈ సినిమాలో చూపిస్తానని, ప్రతీ విషయం క్షుణ్ణంగా చెబుతానని" వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
ఇక నిర్భయ దోషుల ఉరిని మరోసారి వాయిదా వేయడంపై దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ కురుస్తుంది. ఈ నేపధ్యంలో వర్మ దీనిపైన స్పందిచారు. అప్పుడు జంతువుల చేతిలో పడి నిర్భయ గ్యాంగ్ రేప్కు గురైతే.. ఇప్పుడు మన సిస్టమ్ చేతిలో గ్యాంగ్ రేప్కు గురవుతోందంటూ సంచలన ట్వీట్ చేసాడు వర్మ.. అంతేకాకుండా నిర్భయ తల్లిదండ్రుల భావాలు ఎలా ఉంటాయో మీరు ఉహించగలరా ? అంటూ ప్రధానికి ట్వీట్ చేసాడు. నిందితులకి శిక్ష విధించడానికి మన కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి అంటూ వర్మ మరో పోస్ట్ చేశారు.
Hey Mr. @narendramodi Can u even imagine what nirbhaya's parents feelings would be ??? to know that all our courts are falling over each other to give all due processes to those rapists who dint follow a single fucking process in killing that poor girl .
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2020