దర్శకుడు రాంగోపాల్ వర్మ శంషాబాద్ పోలీస్స్టేషన్ వెళ్లాడు. దిశ సినిమా కోసం శంషాబాద్ ఏసీపీని కలవడానికి వచ్చానన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. సినిమా తీసేందుకు తల్లిదండ్రుల అనుమతి పొందారా అన్న ప్రశ్నకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఏసీపీని కలిసిన తర్వాత ఎవరెవరిని కలుస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. దిశ కేసులో ఎన్కౌంటర్ అయిన చెన్నకేశవులు భార్యను ఇంతకు ముందే కలిసి వివరాలు తెలుసుకున్నాడు వర్మ. దిశపై అత్యాచారానికి పాల్పడి తిరిగి ఇంటికొచ్చాక చెన్నకేశవులు ప్రవర్తన, వారింటికి పోలీసులు ఎన్ని గంటలకు వెళ్లారనే విషయంపై మాట్లాడాడు.