Rajamouli RRR : రామ్ చరణ్, ఆలియా భట్ ఫొటోలు లీక్

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే )..

Update: 2020-02-18 06:14 GMT

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

గెటప్స్ లీక్ :

ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్ చరణ్, అయన భార్య సీతా మహాలక్ష్మి గెటప్‌లో ఆలియా భట్ ఫొటోలు బయటికి వచ్చాయి. ఇందులో వారు ఇలాగే కనిపిస్తారా అన్నదానిపై క్లారిటీ అయితే లేదు కానీ ఓ పిక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రిటిష్ పోలీస్ డ్రెస్‌లో చరణ్, అయన భార్యగా సీతమహలక్ష్మి పాతకాలం నాటి ఫోటోలు డిజైన్ చేశారు. మరి ఇవి ఫ్యాన్ మేడ్ పోస్టర్సా లేకా నిజంగానే లీక్ అయ్యాయా అన్నదానిపై క్లారిటీ లేదు.. దీనిపైన చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఇక గతంలో కూడా ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ పిక్ కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే..

పులితో ఫైట్ :

ఈ సినిమాలో కొమరం భీమ్ గా కనిపిస్తున్న ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తారని ఓ టాక్ అయితే బయటకు వచ్చింది. దీనికోసం ఇప్పటికే ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నారని, ప్రొఫెషనల్ ట్రైనర్ సారథ్యంలో నిజం పులితో ఎలా ఫైట్ చేయాలో ఎన్టీఆర్ నేర్చుకున్నారని తెలుస్తోంది.

మహేష్, అమితాబ్ కూడా :

ఈ సినిమాని మొత్తం పది భాషల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే హిందీ, తెలుగు వర్షన్ లకి గాను అమితాబ్, మహేష్ బాబుల చేత రాజమౌళి వాయిస్ ఓవర్ చెప్పించనున్నారట! ఇక మిగతా వర్షన్ లలో ఆ భాషలలోని స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ముందుగా ప్రకటించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి టైం సరిపోకపోవడంతో 2021 జనవరి 8న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.. 


Tags:    

Similar News