చిత్రలహరి సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ప్రతి రోజూ పండగే' .. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మారుతిదర్శకత్వం వహించగా, యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సినిమాని నిర్మించాయి. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాపైన మెగా హీరోలు రామ్ చరణ్ , ఆలు అర్జున్ స్పందించారు.
ఈ చిత్రాన్ని చూసిన రామ్ చరణ్ సోషల్మీడియా వేదికగా స్పందిస్తూ.. 'కుటుంబ విలువల్ని తెలివిగా, వినోదాత్మకంగా మలచి తీసినసినిమా 'ప్రతిరోజూ పండగే'.. ఈ సినిమాని కచ్చితంగా చూడాలి. చిత్ర బృందం పనితీరు బాగుంది' అని చరణ్ ట్వీట్ చేశారు.
Thank you Mega Powerstar #RamCharan garu for your appreciation to our team #PratiRojuPandaage 🤩🕺@IamSaiDharamTej @RaashiKhaana #SatyaRaj #RaoRamesh @DirectorMaruthi @MusicThaman @GA2Official @UV_Creations #BunnyVas @SKNOnline @LahariMusic pic.twitter.com/iVioJ1BMLu
— GA2 Pictures (@GA2Official) December 24, 2019
ఇక అల్లు అర్జున్ 'ప్రతిరోజూ పండగే' చిత్రాన్ని చూసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు "ఈ సినిమాతో సాయితేజ్ హిట్ అందుకున్నందుకు, స్నేహితుడు మారుతి విజయం సాధించినందుకు, బన్నీ వాసు ఓ మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నందుకు, నా తండ్రి మంచి వసూళ్లను రాబట్టుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. యూవీ ఫిల్మ్స్కు కంగ్రాట్స్. ఈ సినిమాతో మరో మంచి ఆల్బమ్ను అందించిన తమన్కు అభినందనలు" అని బన్నీ పేర్కొన్నారు.
Congratulations to the Entire team of Prathi Raju Pandage. So glad my cousin Sai Tej has a good hit , my friend Maruthi has a success, My Life Line Vasu has a good film in his account & My Father has more Profits . Congratulations to UV films. pic.twitter.com/erYDa3jVxs
— Allu Arjun (@alluarjun) December 24, 2019
ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమా సాయి తేజ్ కెరీర్లోనే రికార్డు సృష్టించింది. అమెరికా బాక్సాఫీసు వద్ద అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన తేజ్ చిత్రంగా నిలిచింది. తేజు తన తదుపరి చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నాడు. ఈ సినిమాకి సోలో లైఫే సో బెటర్ అని టైటిల్ ని ఫిక్స్ చేశారు.