రష్మిక పాత్రకు నో చెప్పిన రకుల్

అయితే ముందుగా సినిమాలోని రష్మిక పాత్రకు రకుల్ ని సంప్రదించారట దర్శక నిర్మాతలు.. కానీ

Update: 2019-11-20 10:35 GMT
rakul preet singh

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం గీతా గోవిందం.. గీతా ఆర్ట్స్ 2 పై తెరకెక్కిన ఈ చిత్రం అయిదు కోట్లతో నిర్మించిబడి 125 కోట్లు కొల్లగొట్టిందని విశ్లేషకులు అంచనా వేసారు. ఈ సినిమాతో విజయ్ కి బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చాయి. ఇక రష్మికకి చాలా ఆఫర్స్ వచ్చాయి.

అయితే ముందుగా సినిమాలోని రష్మిక పాత్రకు రకుల్ ని సంప్రదించారట దర్శక నిర్మాతలు.. కానీ డేట్స్ కుదరక ఆ పాత్రను చేయలేదట రకుల్.. ఈ విషయాన్నీ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ చెప్పుకొచ్చింది. అప్పటికే హిందీలో దే దే ప్యార్ దే అనే సినిమాకి సైన్ చేయడంతో రకుల్ ఈ సినిమాని మిస్ ఆయనని రకుల్ చెప్పుకొచ్చింది.

దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగన్ పక్కన నటించింది రకుల్..ఆ పాత్రకి గాను అమెకి మంచి పేరు వచ్చింది. ఇక తెలుగులో రకుల్ ప్రస్తుతం సినిమాలు ఏమి చేయడం లేదు. ఆమె చివరగా నాగార్జున నటించిన మన్మధుడు2 సినిమాలో నటించింది.   

Tags:    

Similar News