రకుల్ కి మరో ఛాన్స్ ఇచ్చిన హీరో
కేరటం సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన
కేరటం సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, ధృవ సినిమాలు ఆమెకి వరుస విజయాలను అందించాయి. ప్రస్తుతం ఈ బ్యూటికీ హిట్లు లేవు. అర్జెంట్ గా ఓ హిట్టు అయితే కావాలి. ఈ సంవత్సరం రకుల్ చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు అవకాశాలు కోసం ఎదురుచూస్తుంది.
ఈ సంవత్సరం చేసిన ఎన్జీకే, మన్మథుడు 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం రకుల్ భారతీయుడు 2 తో పాటు తమిళంలోనే శివకార్తికేయన్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ క్రమంలో రకుల్ కి బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ ఆమెకు మరో అవకాశం ఇచ్చాడు.
గతంలో వీరి కాంబినేషన్ లో . దే దే ప్యార్ దే అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్ళీ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో రకుల్ మళ్లీ హీరోయిన్ గా ఎంపికకైంది. చూడాలి మరి ఈ సినిమాతో అయిన రకుల్ కి మళ్ళీ అవకాశాలు వస్తాయో లేదో