ఇటీవల హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా చేసుకుంటూ వస్తోన్న తమన్నా మరో సినిమాకి కమిట్ అయింది . గతంలో ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ వచ్చిన 'రాజుగారి గది' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే .. . ఆ తరువాత వచ్చిన 'రాజుగారి గది 2' మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో ఈ సారి తమన్నాను ప్రధాన పాత్రధారిగా తీసుకుని 'రాజుగారి గది 3' చేయడానికి రంగంలోకి దిగారు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో పాటు ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. తమన్నా జోడీగా అశ్విన్ కనిపించనున్నాడు.
#RajuGariGadhi3 Kick starts with pooja today
— Venkatesh V (@venkatesh_et) June 20, 2019
@tamannaahspeaks #AshwinBabu #Ohmkar #Tamannaah#RGG3 pic.twitter.com/qOCYrFaShG