బాహుబలి సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమా సైరా... ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా గురించి ఎక్కడ చూసిన పాజిటివ్ టాకే వినిపిస్తుంది. దీనితో మెగా ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. పుల్ జోష్ లో ఉన్నారు. దియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఎక్కడికో తీసుకువెళ్ళిన దర్శకదీరుడు రాజమౌళి సైరాపై స్పందించారు.
సినిమా చాలా బాగుందని ప్రశంసలు కురిపించాడు. సైరాలో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పాత్రలో చిరంజీవి గారి నటన అద్భుతమని, అమోఘమని ట్వీట్ చేసాడు జక్కన్న... చరిత్ర మరిచిన వీరుడి కథను తన అద్భుతమైన నటనతో మళ్ళీ గుర్తు చేసారని రాజమౌళి ట్వీట్ చేసాడు. ఇక సినిమాలో జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా అద్భుతంగా నటించారు. రామ్ చరణ్, సురేందర్ రెడ్డికి కూడా కంగ్రాట్స్ చెప్పాడు రాజమౌళి...
Hearty Congratulations to Charan and @DirSurender for the stupendous and well deserved Success.. #SyeraaNarashimaReddy
— rajamouli ss (@ssrajamouli) October 2, 2019