బన్ని కలిపిన 'రేసుగుర్రం' కాంబో

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ ప్రస్తుతం రవితేజతో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం రవితేజ

Update: 2020-03-14 09:11 GMT
Racegurram combination repeat again

దర్శకుడిగా సురేందర్ రెడ్డి, రచయితగా వక్కంతం వంశీ కాంబినేషన్ సూపర్... ఇప్పటికి వీరి కాంబోలో వచ్చిన కిక్, రేసుగుర్రం, ఉసరవెల్లి, కిక్ 2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక వక్కంతం వంశీ రచయిత నుంచి డైరెక్టర్ అయిపోవడంతో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేసింది లేదు.. అయితే అల్లు అర్జున్ తో సినిమాకి గాను మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పనిచేయనున్నారు. సైరా సినిమా తర్వాత చాలా మంది హీరోలతో సినిమాలను చేసేందుకు ప్రయత్నాలు చేశాడు సురేందర్ రెడ్డి.. కానీ మళ్ళీ అల్లు అర్జున్ ఛాన్స్ ఇవ్వడంతో వంశీతో కలిసి పనిచేసేందుకు సురేందర్ రెడ్డి సిద్దమయ్యాడు..

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ ప్రస్తుతం రవితేజతో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా మొదలు కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఈ నేపథ్యంలో వంశీ, సురేందర్ రెడ్డి కలిసి మళ్ళీ బన్ని సినిమా కోసం పనిచేయనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయేసరికి ఇంకా ఐదారు నెలల సమయం పడుతుంది. అంతలోపు వంశీ, సూరి కలిసి బన్ని కొత్త సినిమా స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దనున్నారు.. ఇక ఈ సినిమాని కూడా గీతా సంస్థనే నిర్మిస్తుంది. 

Tags:    

Similar News