పవన్ తో పూరి ?

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత హీరో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయలకి మాత్రమే పరిమితం అయ్యారు.

Update: 2019-12-28 08:10 GMT
Puri Jagannadh, Pawan kalyan (File Photo)

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత హీరో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయలకి మాత్రమే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు అయన రీఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మంచి హిట్టు అయిన 'పింక్' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారని గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారని, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కానీ దీనిపైన ఇటు పవన్ కళ్యాణ్ కానీ , అటు చిత్ర బృందం కానీ ఇంతవరకు స్పందించింది లేదు.

అయితే ఇప్పుడు ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలని పవన్ లైన్ లో పెడుతున్నారు ఫిలిం నగర్ లో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది. భిన్నమైన కథలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ నగర్లో మరో టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా పూరి ఓ సినిమా చేయనున్నాడని, ఇప్పటికే పవన్, పూరిల మధ్య కథ చర్చలు కూడా అయిపోయాయని టాక్.. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. గతంలో వీరి కాంబినేషన్ లో బద్రి, కెమరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇక ఈ సంవత్సరం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న పూరి ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండతో 'ఫైటర్' అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో విజయ్ ఓ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయనున్నారని టాక్.. ఈ సినిమా తర్వాత పవన్ తో పూరి సినిమా ఉంటుందని టాక్..  

Tags:    

Similar News