బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇర్పాన్ ఖాన్, రిషి కపూర్ మరణాలు మరిచిపోకముందే మరో ప్రముఖ నిర్మాత మరణించాడు. ప్రముఖ నిర్మాత, టెలివిజన్ అండ్ సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ (60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ శుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల ట్విటర్ వేదికగా తమ నివాళులు అర్పించారు.