సీజన్ వన్ సీజన్ టూతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ .. కానీ బిగ్ బాస్ మూడవ సీజన్ మాత్రం వివాదాలకు కేరాఫ్గా మారింది. కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో పై సినీనిర్మాత కేతిరెడ్డిజగదీశ్వర్రెడ్డి హైకోర్టు కోర్టులో పిటిషన్ వేశారు. అశ్లీలంగా దుస్తులు వేసుకుంటున్నారని, డబుల్ మీనింగ్ పదాలతో మాట్లాడుతున్నారని ... సినిమాలాగా ప్రతి ఎపిసోడ్ను సెన్సార్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిల్ దాఖలు చేయడంతో పాటు రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలని కోరారు. మరి ఈ వ్యవహారంపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.