భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కేసులా సంఖ్య పెరిగాయి. గత 24గంటల్లోనే 693 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4067కి చేరిందన్నారు. తాజాగా ముంబైలో బాలీవుడ్ చిత్ర నిర్మాత కరీం మొరానీ కూతురు షాజా మొరానీకి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఆమెను నానావతి ఆస్పత్రిలో చేర్పించారు.
చెన్నై ఎక్స్ప్రెస్, రావన్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాల నిర్మాత, హీరో షారుఖ్ ఖాన్ ఆప్త మిత్రుడు కరీం మొరానీ. అతడి కూతురు షాజా జరానీ అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. లాక్ డౌన్కు ముందే ఆస్ట్రేలియా నుంచి షాజా ఇండియాకు తిరిగొచ్చింది. కాగా షాజా జరానీ ఆల్వేస్ కబీ కబీ, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. షాజా మొరానీ ట్రావెల్ హిస్టరీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మొరానీ కుటుంబసభ్యులు మొత్తం క్వారంటైన్లో ఉన్నారు. అనంతరం కుటుంబసభ్యులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.