'రూలర్' ను మించేలా మరో సినిమాని చేస్తాం: సీ.కళ్యాణ్
జై సింహ తర్వాత నందమూరి బాలకృష్ణ కే. యస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రూలర్.
జై సింహ తర్వాత నందమూరి బాలకృష్ణ కే. యస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రూలర్. సీ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాని నిర్మిచగా, వేదిక, సోనాలి చౌహాన్ కథానాయకులుగా నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ నెల 20 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటగా ఈ సినిమా మిక్సు డ్ టాక్ రాగా ఆ తర్వాత కలెక్షన్లు తగ్గుకుంటూ వచ్చాయి. ఈ సినిమాకి పోటిగా రిలీజ్ అయిన ప్రతిరోజూ పండగే, దొంగ సినిమాలకి పాజిటివ్ టాక్ రావటంతో రూలర్ బాక్స్ ఆఫీస్ వద్ద చేతికలపడింది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా నిర్మాత అయిన సీ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడుతూ పైరసీ కారణంగా సినిమాకి నష్టం జరుగుతుందని, తాను సూపర్ హిట్ సినిమా చేసినా పైరసీ అవ్వటం వల్లే జనం థియేటర్లకు రావటం లేదన్నట్టుగా కామెంట్స్ చేశారు సీ కళ్యాణ్. ఇప్పటికే 7 వేలకు పైగా పైరసీ లింక్ను తొలగించినట్టుగా ఆయన తెలిపారు. ఇలా పైరసీ చేయటం వల్ల సినిమాలు క్వాలిటీగా తీయాలన్న ఇంట్రస్ట్ పోతుందని తన ఆవేదన వ్యక్తం చేశారు కళ్యాణ్
రూలర్ సినిమాకి గాను ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని, సినిమా సూపర్ హిట్టు అని చెప్పుకొచ్చాడు. త్వరలో రూలర్ను మించేలా మరో సినిమా చేస్తామని వెల్లడించారు కళ్యాణ్.. ఈ సినిమాలో జయసుధ, ప్రకాష్ రాజ్, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. చిరంతన్ భట్ సంగీతం అందించాడు.
ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నారు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తునాడు. వచ్చే ఏడాది మేలో సినిమాని రిలీజ్ చేయనున్నారు.