వృద్ధాశ్రమంలో..'ప్రతిరోజూ పండగే' స్పెషల్ షో
మనం ఎంత బిజీగా ఉన్న మన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలన్న నేపధ్యంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే' ..
మనం ఎంత బిజీగా ఉన్న మన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలన్న నేపధ్యంతో తెరకెక్కిన చిత్రం 'ప్రతిరోజూ పండగే' .. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా కలిసి నటించారు. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించారు.ఈ సినిమాని యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. గోపి సుందర్ సంగీతం అందించారు.
క్రిస్మస్ పండగకి కానుకగా ఈ నెల 20న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు సెలబ్రిటీల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కచ్చితంగా చూడాల్సిన సినిమా అని కొనియాడుతున్నారు. ఇక కామెడీకి థియేటర్లో నవ్వుల పండగేనని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది.
ఈ నేపథ్యంలో వృద్ధాశ్రమంలో ఉంటున్న వారికోసం 'ప్రతిరోజూ పండగే' సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు హీరో సాయితేజ్... ఈ విషయాన్నీగీతా ఆర్ట్స్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఈ సినిమా చూసిన అనంతరం వృద్ధులు సినిమా బాగుందని, త్వరలో హీరో సాయి తేజుని కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో సాయితేజ్ త్వరలో వారిని కలుస్తానని పేర్కొన్నారు.
Thank you everyone for your unconditional love & affection towards me, I'm definitely gonna come down to your home and meet you all soon 💕 #PratiRojuPandaage https://t.co/NRd7LjnVr8
— MEE VALLA NAAKU PRATHI ROJU PANDAAGE (@IamSaiDharamTej) December 27, 2019