పిక్స్ వైరల్ : కొత్త లుక్ లో ప్రభాస్..
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. బహుబలికి ముందు ప్రభాస్, బాహుబలి తర్వాత ప్రభాస్ అనే రేంజ్ కి చేరిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్ళనే సాధించింది.
ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. పూర్వ జన్మల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తుంది. ఈ ఏడాది చివరలో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే సాహో చిత్ర రిలీజ్ సమయంలో ఓ కాంటెస్ట్ నిర్వహించారు, అందులో విజేతగా నిలిచిన వారికి ప్రభాస్ని కలిసే ఛాన్స్ కలిపించారు మేకర్స్ . అందులో కాంటెస్ట్ విన్నర్స్ ఇటీవల ప్రభాస్ని కలిసారు. ప్రభాస్ తో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
కే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత ప్రభాస్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అల్లు అర్జున్ , పూజా హేగ్దే హీరోహీరోయిన్లుగా నటించారు.