ప్రభాస్ ఫ్యాన్స్ కి శుభవార్త.. ఉగాదికే ముహూర్తం
గతేడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.. బాహుబలి లాంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కానీ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ భారీగానే వసూళ్ళను సాధించింది.
గతేడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.. బాహుబలి లాంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కానీ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ భారీగానే వసూళ్ళను సాధించింది. ఇక ఈ సినిమా తరవాత ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి 'రాధేశ్యామ్' లేదా 'ఓ డియర్' అనే పేర్లను పరిశీలిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను ఉగాది కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక అదే రోజు టైటిల్ను కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఓ క్రేజీ ఛేజింగ్ సీన్లో ప్రభాస్ పాల్గొన్న దృశ్యాలను షూట్ చేసినట్టుగా చిత్ర బృందం పేర్కొంది. అంతర్జాతీయ ప్రొఫెషనల్స్ సహకారంతో ఈ సీన్ను తెరకెక్కించామని, ఇక యూరప్లో భారీ షెడ్యూల్ను ప్లాన్ చేశామని, మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.
పూర్వజన్మల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కాజల్ ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుందని సమాచారం.. సినిమాని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
నాగ్ అశ్విన్ తో సినిమా :
ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ సినిమాని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ గ్రాప్ లో సినిమా ఉంటుందని తెలుస్తోంది! సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.