పాకిస్థాన్లోని ఆలయంలో శివ పూజ చేసిన పూనమ్ కౌర్
పూనమ్ కౌర్ పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న కటాస్ రాజ్ అనే ఓ పురాతన ఆలయంలో శివ పూజ చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న కటాస్ రాజ్ అనే ఓ పురాతన ఆలయంలో శివ పూజ చేశారు. కటాస్ రాజ్ ఆలయాన్ని అక్కడి హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయం కల్లార్ కహార్ పట్టణానికి సమీపంలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ఆలయంలో పూజలు చేస్తానని కలలో కూడా అనుకోలేదని పూనమ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఇక పూనమ్ కౌర్ విషయాని వస్తే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. పలు తెలుగు,తమిళ్,హిందీ సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
"Aangikam Bhuvanam Yasya
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 19, 2019
Vachikam Sarva vaanmayam
Ahaaryam Chandra taaradi
Tam Vande Sattwikam shivam ''
'' #katasraj in #Pakistan '' pic.twitter.com/UJNbQy4mhV