క్షమాపణలు కోరిన రాజశేఖర్.. దయచేసి మరోలా అర్థం చేసుకోవద్దంటూ మెసేజ్

Update: 2020-01-03 07:02 GMT
రాజశేఖర్

చిరంజీవికి తనకు మధ్య ఎలాంటి గొడవలు, అపోహలు లేవన్నారు సినీ నటుడు రాజశేఖర్. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఏది జరిగినా అది నాకు, నరేశ్‌కు , మాకు మధ్య మాత్రమేనని అన్నారు. ఏ ఒక్క పని సరిగా జరగడం లేదని పేర్కొన్నారు. అందుకే తాను మాట్లాడకుండా ఉండలేకపోయానని తెలిపారు. తనకు చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఎలాంటి అపోహలు, గొడవలు లేవన్నారు.

నావల్ల జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నా అని పేర్కొన్నారు రాజశేఖర్. మా కార్య నిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశానని చిత్ర పరిశ్రమకు కావాల్సిన ఏం సాయం కావాలన్నా చేస్తానని తెలిపారు. చిరంజీవి, మోహన్ బాబు తనకు మధ్య జరిగినది గొడవగా సృష్టించవద్దన్నారు. వారిద్దరిపైనా అమితమైన గౌరవం ఉందని చెప్పారు. మా కు వారి సేవలు అవసరమని దయచేసి దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని ట్విటర్‌లో రాజశేఖర్ పేర్కొన్నారు.


 

Tags:    

Similar News