మేనల్లుడి సినిమాకి మామ ఫిదా
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'.. రాశీఖన్నా కథానాయకగా నటించింది.
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'.. రాశీఖన్నా కథానాయకగా నటించింది. రావు రమేష్, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహించగా యువీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 కలిసి సినిమాని నిర్మించాయి. మెకానికల్ లైఫ్ కి అలవాటు పడ్డ పిల్లలు తమ తల్లితండ్రులను పట్టించుకోవడం లేదు అన్న నేపధ్యంతో ఈ సినిమాని తెరకెక్కింది. ఫ్యామిలీ ఎమోషన్స్, సూపర్ కామెడీ కూడా ఉండడంతో సినిమాకి మంచి టాక్ వచ్చింది,
అయితే తాజాగా ఈ సినిమాని సాయి తేజ్ మేనమామ, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చూసారు. సినిమా తనకు చాలా నచ్చిందని తెలుపుతూ సాయి తేజ్కు బొకే పంపారు. అందులో పవన్ కళ్యాణ్ 'డియర్ సాయి ధరమ్ తేజ్ గారు... 'ప్రతిరోజూ పండగే' సినిమా గ్రాండ్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. మీరు భవిష్యత్తులో చేయబోయే సినిమాలకు ఆల్ ది బెస్ట్' అని పేర్కొన్నారు. తనకంటే చిన్న, తన మేనల్లుడుని కూడా పవన్ గారు అని సంబోధించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిని సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ 'మాటలు సరిపోవడం లేదు. ధన్యవాదాలు అన్న పదం కూడా చాలా చిన్నది. లవ్యూ పవన్ కళ్యాణ్ మామా' అని పేర్కొన్నారు
సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. సాయి మొదటి సినిమా రేయ్ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చి బ్లెస్ చేశారు. అంతేకాకుండా సాయికి చాలా ప్లాప్ ల తర్వాత చిత్రలహరి హిట్ వచ్చినప్పుడు కూడా పవన్ బోకే పంపించి విష్ చేశారు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కొత్త దర్శకుడితో సోలో బతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి..
Falling short of words...and thank you seems to be too small of a word right now...love you @PawanKalyan mama ❤️🤗😘 #prathirojupandaage pic.twitter.com/CxrQbMDodm
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 13, 2020