వేణుమాధవ్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న పవన్ కళ్యాణ్ ...

Update: 2019-09-25 09:22 GMT

టాలీవుడ్ ని మరో విషాదం వెంటాడింది. ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అనారోగ్య సమస్యతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో మరణించారు. అయన మరణం పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయన మరణం ఎంతో భాదాకరం అని అన్నారు.

వేణుమాధవ్ మంచి టైమింగ్ ఉన్నా నటుడని, మంచి భవిషత్తు నటుడు మరణించడం బాధగా ఉందని పవన్ చెప్పుకొచ్చారు. వేణుమాధవ్ స్వతహ గా మిమిక్రి ఆర్టిస్ట్ కావడంతో సెట్లో పలువురుని ఇమిటేట్ చేసి అందరిని నవ్వించేవారని  పవన్ గుర్తు చేసుకున్నారు. అయన మరణం పట్ల అయన ఆత్మకి శాంతి చేకూరాలని అంతే కాకుండా అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తునట్లు పవన్ చెప్పారు. పవన్ వేణుమాధవ్ కలిసి తొలిప్రేమ, తమ్ముడు, గోకులంలో సీత, అన్నవరం, గుడుంబా శంకర్, బంగారం లాంటి సినిమాల్లో నటించారు. 

Tags:    

Similar News