ఎట్టకేలకు మళ్ళీ మేకప్ వేసుకున్న పవన్ !

పవన్ కళ్యాణ్ 25 వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత పవన్ మళ్ళీ మేకప్ వేసుకుంది లేదు.

Update: 2020-01-20 12:14 GMT

పవన్ కళ్యాణ్ 25 వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత పవన్ మళ్ళీ మేకప్ వేసుకుంది లేదు. ఇక గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పూర్తి స్థాయి రాజకీయాలకి పరిమితం అయ్యారు పవన్ కళ్యాణ్ . ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయినప్పటికి ప్రజల తరుపున ప్రభుత్వం పై పోరాడుతూ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. అయితే అయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..

బాలీవుడ్ లో మంచి హిట్టు అయిన 'పింక్' సినిమాని పవన్ తెలుగు రీమెక్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. పవన్ తో పాటు నివేతా థామస్, అంజలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి లాయర్ సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇది పవన్ కి 26 వ చిత్రం. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 23న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని, భారీ పారితోషకం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసారని తెలుస్తోంది. 

Full View


Tags:    

Similar News