పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన మేకర్స్!

అటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోపక్కా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్... ఆయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Update: 2020-05-02 07:31 GMT
Pawan kalyan

అటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోపక్కా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్... ఆయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'పింక్' సినిమాకు ఇది రీమేక్. ఇది పవన్ కళ్యాణ్ కి 26 చిత్రం.ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనీకపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నాడు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ , ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..

దాదాపు 80 శాతం పూర్తయిన చిత్ర షూటింగ్ ప్రస్తుతం లాక్ డౌన్ వలన వాయిదా పడింది. అన్ని అనుకున్నట్టు కుదిరితే వకీల్ సాబ్ సినిమా మే నెలలో విడుదల అయ్యేది. కానీ వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడడంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న సందేహం పవర్ స్టార్ అభిమానులలో కలుగుతుంది. అయితే తాజాగా ఫ్యాన్స్ కి మేకర్స్ మరో షాక్ ఇచ్చారు.

వకీల్ సాబ్ చిత్ర నిర్మాతల్లో ఒకరైనా బోని కపూర్ కరోనా లాక్ డౌన్ ఎత్తి వేసే వరకు తమ బ్యానర్‌లో వచ్చే చిత్రాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉండవని ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీనితో సినిమాకు సంబంధించిన ప్రమోషన్, టీజర్ , ట్రైలర్ విడుదలయ్యే అవకాశం లేదు. దీనితో లాక్ డౌన్ ముగిసేవరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండబోవన్న మాట.!

ఇక వకీల్ సాబ్ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది. 

Tags:    

Similar News