నేను కన్నీళ్ళు పెట్టుకోలేదు : పరుచూరి

Update: 2019-10-20 11:16 GMT

మా సభ్యులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో గందరగోళం జరుగడంతో అక్కడి నుండి ప్రముఖ రచయత పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకొని వెళ్ళిపోయారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండించారు పరుచూరి.. ముఖ్యంగా ఈ వార్త నటుడు పృథ్వీ చెప్పడంతో వైరల్ గా మారింది. అయితే దీనిపైన పరుచూరి మాట్లాడుతూ నేను సమావేశం నుంచి కంటతడి పెట్టుకుని బయటికి వచ్చినట్టు కొన్ని మీడియా చానల్స్ లో వార్తలు వచ్చాయని కానీ వాటిని నేను ఖండిస్తున్నానని అన్నారు. తానూ మా సభ్యుల సమావేశానికి హాజరైంది వాస్తవమేనని అయితే కొందరి సభ్యుల తీరు నచ్చకే అక్కడినుండి బయటికి వచ్చేశానని, అంతేకాని కంటతడి పెట్టుకున్నా అని అనడంలో వాస్తవంలేదని స్పష్టం చేశారు.

అయితే అంతకుముందు నటుడు పృథ్వీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణని మాట్లాడనివ్వకుండా చేసారని , అయన కంటతడి పెట్టుకొని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు పృథ్వీ.. మెంబర్స్ అందురు కలిసి కట్టుగా ఉండాలి కానీ ఇలా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరించకూడదని అన్నారు. ప్రతి ఒక్కరు దీనిని ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గా ఫీల్ అవుతున్నారని వాఖ్యానించారు పృథ్వీ ..

Tags:    

Similar News