Nithiin Bheeshma: 50 కోట్ల క్లబ్లో భీష్మ
యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా, వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ'. మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్ ని సంపాదించుకొని దూసుకుపోతుంది.
యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా, వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ'. మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్ ని సంపాదించుకొని దూసుకుపోతుంది.. శ్రీనివాస కళ్యాణం లాంటి ప్లాప్ తరవాత చాలా గ్యాప్ తీసుకొని సినిమాని చేసిన నితిన్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా విడుదలై విజయం సాధించింది.
ఆడియన్స్ నుంచి రివ్యూలు వరకు ఎక్కడ చూసిన అసలు జనాలు సీట్లలో కూర్చుంటేగా అన్నట్టుగానే సాగింది. అడుగడుగునా పంచెస్ తో,బ్యాక్ బ్యాక్ హిలేరియస్ సీన్స్ తో కితకితలు పెట్టి కామిడీ సన్నివేశాలు, నితిన్ డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని వేటికవే సమానంగా నిలిచాయి. దీనితో మొదటిరోజు నుంచే మంచి టాక్ రావడంతో నైజాం లో 2.21 కోట్ల షేర్ రాబట్టిన భీష్మ అదే ఊపును కనబరుస్తూ రెండో రోజు 5.0కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక మొదటి రెండు రోజుల్లోనే భీష్మ 13.03కోట్ల షేర్ను, 19.30కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇక అటు ఓవర్సీస్లో కూడా అదరగొడుతోంది. దీంతో అక్కడ ఆరు కోట్లకు పైగా వసూళ్లు వచ్చిన ట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మొదటి వారంలో ఈ సినిమా 24.00 కోట్ల షేర్ను 50 కోట్ల గ్రాస్ను రాబట్టింది.
ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.
ఇక ఈ శుక్రవారం థ్యాంక్స్ మీట్ను ఏర్పాటుచేయనుంది చిత్ర యూనిట్. వైజాగ్లోని గురజాడ కళాక్ష్రేత్రంలో ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. ఈ విషయాన్ని సీతార ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాని చూసిన వరుణ్ తేజ్ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపాడు.