తెలుగు సినిమాల్లో అనుష్క కనిపించి చాలా రోజులు అవుతుంది. మొన్న వచ్చిన సైరా సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది. భాగామతి అనుష్క చివరి సినిమా అని చెప్పాలి. ప్రస్తుతం అనుష్క మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న చిత్రం నిశబ్దం.. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. అయితే దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ టీజర్ విడుదల చేసింది. ఇందులో అనుష్క ఓ ముగ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. సినిమా ఎక్కువ భాగాన్ని అమెరికాలో చిత్రికరిచారు. ఇందులో మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. అంజలి, షాలినిపాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. సినిమాని అనుష్క పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 07 న విడుదల చేయనున్నట్టు టిజర్ లో పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది.