'సరిలేరు నీకెవ్వరు'లో సరికొత్త సీన్స్ ఎప్పుడంటే ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఘన విజయాన్ని దక్కించుకుంది. సినిమాకి మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది.
అయితే ప్రేక్షకులకి మరింత ఉత్సాహన్ని నింపేందుకు చిత్ర యూనిట్ మరిన్ని కొన్ని సన్నివేశాలని యాడ్ చేయనుంది. అయితే ఈ కొత్త సన్నివేశాలు జనవరి 25(శనివారం) మార్నింగ్ షో నుంచి అన్నిసెంటర్స్లలో రానున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. సినిమాలో భాగంగా సూపర్స్టార్ మహేష్ బాబు, రావురమేష్ ఫ్యామిలీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని మరింతగా ఆకట్టుకున్నాయి. అయితే ఆ సన్నివేశాలకి కొనసాగింపుగా ఒక మంచి హిలేరియస్ సన్నివేశాన్ని జతపరిచమని చెప్పుకొచ్చారు..
ఈ సినిమాలో మహేష్ మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 200 కొట్ల షేర్ ని రాబట్టింది.
ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నాడు మహేష్.