చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఖేల్ ప్లే రమ్మీ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది కాజల్.. ఖేల్ ప్లే రమ్మీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపీక అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది కాజల్.. అయితే ఇప్పుడు ఇదే కాజల్ కి తలనొప్పిని తీసుకువచ్చింది. దేశంలోనే అగ్రగామి ఆన్ లైన్ గేమ్గా KPR నిలుస్తుందని, అలా చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది కాజల్.. దీనితో ఇప్పుడు కాజల్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు.. పేకాట రాణి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ భాద్యతగల హీరోయిన్ అయి ఉండి, ఆన్ లైన్ రమ్మీ ఆడండంటూ ఎలా ప్రోత్సహిస్తున్నావు అని మండిపడుతున్నారు. ప్రస్తుతం కాజల్ కమల్ హసన్ సరసన భారతీయాడు 2 సినిమాలో నటిస్తుంది. అయితే దీనిపైన కాజల్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ లాంటి హీరోలు లిక్కర్ బ్రాండ్ కి అంబాసిడర్గా చేస్తే తప్పులేదా అని ప్రశ్నిస్తున్నారు.