సైకోగా నాని: ఆకట్టుకుంటున్న 'వి' టీజర్
యంగ్ హీరోస్ నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న చిత్రం 'వి'... ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
యంగ్ హీరోస్ నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న చిత్రం 'వి'... ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.. 01: 02 సెకండ్స్ ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ ని 25k మంది విక్షించడం విశేషం..
'ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్.. అప్పుడప్పుడూ నాలాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడంతే' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ తో చిత్ర టీజర్ మొదలవుతుంది. నువ్వో సైకో అంటూ నివేతా థామస్ చెప్పే డైలాగ్ తో హీరో నానిది ఇందులో పూర్తిగా నెగిటివ్ రోల్ అని తెలిసిపోయింది. ఇక సుధీర్, నానిల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మొత్తం ఓ థ్రిల్లర్ జోనర్ లో సినిమా సాగుతుందని తెలుస్తోంది. టీజర్ చివర్లో సుధీర్బాబును ఉద్దేశిస్తూ నాని 'న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేమి నీ ఫ్యాన్ని కాదురా', 'సోదాపు.. దమ్ముంటే నన్నాపు' అన్న డైలాగ్ హైలెట్ గా నిలిచింది. కానీ చిత్ర టీజర్లో ఎక్కడ కూడా హీరోయిన్ అదితిరావు హైదరీని చూపించలేదు..
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇది నానికి 25 వ సినిమా కాగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఇది మూడో సినిమా... గతంలో అష్టచమ్మా, జెంటిల్ మెన్ అనే చిత్రాలు వచ్చాయి.