సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 వ సినిమా మహర్షి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది . ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు . పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది . అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించాడు. సినిమా అన్ని చోట్ల మంచి టాక్ ని సొంతం చేసుకుంది . అయితే దీనిపై అయన భార్య నమ్రత శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్లో స్పందించారు ..
అభిమానులకు ఓ మంచి సినిమా ఇచ్చేందుకు నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది . ఇప్పుడు ప్రపంచం ఆ కష్టాన్ని చూడబోతోంది. గుడ్ లక్ టు మై లవ్ మహేశ్ అని మహర్షి సినిమాలో రిషి అనే పాత్ర నాకు బాగా నచ్చింది . అదే విధంగా సినిమా అందరికి నచ్చాలని కోరుకుంటున్నాని ఆమె పోస్ట్ చేసారు .. నమత్ర మహేశ్ను ఆలింగనం చేసుకున్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. మహేశ్ నమ్రత వెనక దాక్కుని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.