మెగా కాంపౌండ్ లోకి నభా నటేష్

నటిగా మంచి గుర్తింపు రావడంతో ఆమెకి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే రవితేజ హీరోగా

Update: 2019-11-20 13:46 GMT
nabha natesh

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది నభా నటేష్.. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి ఇటు అందంతో, అటు అభినయంతోను ఆకట్టుకుంది ఈ భామ.. ఈ సినిమాకి గాను నటిగా మంచి గుర్తింపు రావడంతో ఆమెకి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ఇస్మార్ట్ బ్యూటి..

అంతేకాకుండా ఇప్పుడు మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టనుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నూతన దర్శకడు సుబ్బు దర్శకత్వంలో తెరకేక్కబోయే సోలో బ్రతుకే సో బెటరూ అనే సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది నభా.. తాజాగా సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమా హిట్టు అయితే నభా నటేష్ కి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం..

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతీ దర్శకత్వంలో ప్రతిరొజూ పండగే అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Tags:    

Similar News