ప్రపంచాన్నీ కరోనా వణికిస్తోంది. చైనాలో మొదలై 195 దేశాలకి వ్యాపించి విలయ తాండవం చేస్తోంది. అయితే దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే కృషి చేస్తున్నాయి. కాగా కరోనా వైరస్ గురించి మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మోహన్లాల్ అందరూ కలిసి చప్పట్లు కొట్టడం వలన కరోనా వైరస్ చనిపోయే అవకాశం ఉంది. చప్పట్ల శబ్దం నుంచి ఓ మంత్రం లాంటిది పుట్టుకొస్తుంది. దీని వలన బ్యాక్టీరియా, వైరస్లు చనిపోయే అవకాశం ఉంటుంది. చప్పట్లు కొట్టి అందరం వైరస్ను నియంత్రిద్దాం అని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలు వైరల్గా మారగా. దీనిపై ట్రోల్స్ కూడా భారీగా వచ్చాయి.
దీనిపై శ్రీను అనే వ్యక్తి కేరళ మానవ హక్కుల కమిషన్లో మోహన్లాల్పై ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోహన్ లాల్ ఇలా ప్రచారం చేయడం సరికాదని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆ వ్యక్తి తెలిపారు.