మంచు ఫ్యామిలీ బిగ్ అనౌన్స్.. 60 కోట్ల బడ్జెట్ తో పౌరాణిక చిత్రం
మంచు మోహన్ బాబు తనయుడుగా 'విష్ణు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మంచు విష్ణు.. డీ, దేనికైనా రెడీ
మంచు మోహన్ బాబు తనయుడుగా 'విష్ణు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మంచు విష్ణు.. డీ, దేనికైనా రెడీచిత్రాలు నటుడిగా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. అయితే ఈ మధ్య హిట్ లేకా సతమతం అవుతున్న విష్ణు కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం తెలుగు ఇంగ్లీష్ భాషాల్లో 'మోసగాళ్లు' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే నిన్న మహాశివరాత్రి సందర్భంగా విష్ణు ప్రధాన పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా మోహన్ బాబు నిన్న శ్రీకాళహస్తిని సందర్శించాడు. ఆ పుణ్యక్షేత్రంలోనే తన కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించారు. . దాదాపుగా 60 కోట్ల బడ్జెట్తో పౌరాణిక చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు 'భక్త కన్నప్ప'గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలోని నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని మోహన్ బాబు వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరు అన్న ఆసక్తి నెలకొంది. ఇక భక్తకన్నప్ప లాంటి పౌరాణిక చిత్రం కావడంతో ఈ సినిమాపైన అంచనాలు నెలకొన్నాయి.
60 Crores budget tho Vishnu Vardham Babu, Bhaktha Kannappa chithraanni nirmisthaaru - Sri Kalahasthi Temple lo prakatinchina Collection King Dr. Mohanbabu pic.twitter.com/VNmFMz3zFg
— BARaju (@baraju_SuperHit) February 21, 2020
ఇక మరోవైపు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ 'అహం బ్రహ్మస్మి' అనే సినిమాని చేస్తునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాను మార్చి 6న లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓ కొత్త కాన్సెప్ట్ తో తెరకేక్కుతుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా మనోజ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి!