సెలబ్రేటిలు కనిపిస్తే ఇప్పుడు అందరికి ముందుగా గుర్తొచ్చేది సేల్ఫీ మాత్రమే.. ఇక అందులో హీరోయిన్ అయితే ఇంకా ఎగబడి మరి ఫోటోలు దిగుతారు. అవును ప్రతి అభిమానిలాగే ఓ అంకుల్ కూడా పూజా హేగ్దేతో సేల్ఫీ దిగాలని ఎంతో ట్రై చేశాడు పాపం.. కానీ అతనికి లక్ కలిసిరాలేదు. ఓ విమానాశ్రయంలో పూజా హేగ్దే కనిపించడంతో అందరు ఆమెతో సేల్ఫీ కోసం ట్రై చేశారు.
పూజా కూడా ఆగి ఫోటో గ్రాఫర్స్ కి, ఫ్యాన్స్ కి ఫోటోలు ఇచ్చింది. అందులో ఓ అంకుల్ సేల్ఫీ దిగాబోతుండగా ఫోన్ జారిపోయింది. ఇక చివరగా ఫోన్ను అటు మార్చి ఇటు మార్చి మొత్తానికి ఏదో ఒకటి చేసారు. అయిన పాపం కుదరలేదు. నిజానికి ఎవరు కూడా అంతసేపు వెయిట్ చేయరు కానీ పూజా అతనికోసం బాగానే వెయిట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గోల్డెన్ లెగ్ అనే ముద్రకూడా పడిపోయింది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ హిట్ అయింది. ప్రస్తుతం ప్రభాస్తో, అఖిల్తో కలిసి నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్లో సూపర్స్టార్ సల్మాన్ ఖాన్తో కలిసి 'కబీ ఈద్ కబీ దివాలీ' అనే సినిమాలో నటించనుంది.