ప్రస్తుతం తెలుగులో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. మహానటిగా సావిత్రి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్రగా వైఎస్సార్ బయోపిక్ లు వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి. దీనితో దర్శక నిర్మాతలు బయోపిక్ లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి బయోపిక్ పై ఓ టాక్ మొదలైంది. ఇది ఏకంగా చిరు వరకు వెళ్ళింది.
చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా.. సినిమాకి మంచి టాక్ రావడంతో సినిమా దూసుకుపోతుంది. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా 'చిరంజీవి బయోపిక్' కు సంబందించిన ప్రశ్నలు మెగాస్టార్ కు ఎదురయ్యాయి. దీనిపైన చిరంజీవి స్పందించారు.
నా బయోపిక్ పై సినిమా వస్తే మాత్రం అందులో హీరోగా చరణ్ మాత్రం వద్దు. చరణ్ ఆ సినిమా చేస్తే సినిమాకి వందకి వంద శాతం న్యాయం చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ నా పోలికల్లో ఎక్కువగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ లకు వచ్చాయని బయట అంటుంటారు. అందుకే వారిలో ఎవరు చేసిన బాగుంటదని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సైరా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి. ఆ తర్వాత కొరటాల శివతో సినిమాని స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాని కూడా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ పై నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలేక్కనుంది.