Megastar Chiranjeevi: చిరు 'లూసిఫర్' రీమేక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది కానీ లాభాలు రాలేదు..
గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది కానీ లాభాలు రాలేదు.. ఈ సినిమా తర్వాత చిరు తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు ... ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ప్రస్తుతం కోకాపేటలో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది.. చిరంజీవిపైన కొన్ని కీలక సన్నివేశాలను కొరటాల చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి గోవిందా ఆచార్య అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన 153వ చిత్రాన్ని ఎవరు చేయబోతున్నరన్న ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని చిరునే స్వయంగా ప్రకటించాడు. ఆ తర్వాత పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు చిరు తన 153వ చిత్రాన్ని మలయాళ చిత్రం `లూసిఫర్`ను రీమేక్ చేయబోతున్నారు. దీనికి ముందుగా సుకుమార్ ని దర్శకుడు అని అనుకున్నారు కానీ కుదరలేదు.. ప్రస్తుత సమాచారం మేరకు ఈ రీమేక్ను వి.వి.వినాయక్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయట! ఇక ఇప్పటికే చిరు రీఎంట్రీ మూవీ ఖైది 150 ని వినాయక్ డైరెక్ట్ చేశారు. దీనికి కూడా వినాయక్ అయితే బెటర్ అని చిరు భావిస్తున్నారట! ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు..
ఆర్ఆర్ఆర్ లో చరణ్ ...
బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8 న సినిమాని విడుదల చేస్తున్నారు.