మోహన్ బాబు పై చిరంజీవి ఆసక్తికరమైన ట్వీట్

చిరంజీవి సోషల్ మీడియాలోకి రావడంతో ఆయన అభిమానులతో పాటు సినీ తారలు సైతం ఆయనని ఫాలో అవుతూ స్వాగతం తెలుపుతున్నారు.

Update: 2020-03-26 12:59 GMT
Mohan Babu and Chiranjeevi (File photo)

తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా చక్కటి వేదిక అని, ఇక నుంచి సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.. ఉగాది సందర్భంగా తన తొలి పోస్ట్ ని చేశారు.

ఇక చిరంజీవి సోషల్ మీడియాలోకి రావడంతో ఆయన అభిమానులతో పాటు సినీ తారలు సైతం ఆయనని ఫాలో అవుతూ స్వాగతం తెలుపుతున్నారు. అందులో భాగంగా నటుడు మంచు మోహన్ బాబు స్వాగతం పలుకుతూ.. " వెల్ కం మిత్రమా.. అని ట్వీట్ చేయగా, దానికి చిరంజీవి స్పందిస్తూ.. "థాంక్యూ మిత్రమా రాననుకున్నవా.. రాలేననుకున్నవా" అంటూ ఇంద్ర సినిమాలోని డైలాగ్ ని పోస్ట్ చేశారు..

చరణ్ పై ఆసక్తికరమైన ట్వీట్ :

తండ్రి చిరంజీవి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన రోజే తనయుడు చరణ్ కూడా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చరణ్‌కు స్వాగతం చెబుతూ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు.. '' ట్విట్టర్ ప్రపంచంలోకి రామ్ చరణ్‌కు స్వాగతం. సింహాన్ని దాని పిల్ల ఫాలో అవుతుంది'' అంటూ చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిని మెగా అభిమానులు షేర్ చేస్తూ సంతోషిస్తున్నారు.



Tags:    

Similar News